వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓటర్ల జాబితాలపై ఇసి సీరియస్
న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి పిలుపునిచ్చారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని ఆయన సూచించారు.
ఏడు బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన బుధవారం తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కింది స్థాయి వరకు చేరాలని ఆయన కూడా ఆయన సూచించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్ఘడ్, గోవా రాష్ట్రాల్లో పార్టీ ఎన్నికలకు సన్నద్ధమైన తీరును ఈ సమావేశంలో సమీక్షించారు. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీ అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడుతో కూడా సమావేశమవుతారు.
Comments
Story first published: Wednesday, January 21, 2004, 23:53 [IST]