వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓటర్ల జాబితాలపై ఇసి సీరియస్
వరంగల్: దేవాదుల ప్రాజెక్టు ప్రణాళికను మార్చారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం ఆందోళనకు దిగారు. వరంగల్- ఏటూరు నాగారం జాతీయ రహదారిపై వారు రాస్తారోకో నిర్వహించారు.
కాంగ్రెస్ కార్యకర్తలు దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోచేశారు. దీంతో మూడు కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. దేవాదుల ప్రాజెక్టుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక చోట శంకుస్థాపన చేసి ఇప్పుడు దాన్ని ధర్మసాగర్కు మారుస్తున్నామని ప్రకటించారని, ఇదిసరైంది కాదని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు.
Comments
Story first published: Wednesday, January 21, 2004, 23:53 [IST]