వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓటర్ల జాబితాలపై ఇసి సీరియస్
హైదరాబాద్: తుపాను తాకిడి ప్రాంతాలకు రూ.367 కోట్ల ఆర్థిక సహాయంఅందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలు ఇటీవల తుపాను తాకిడికిగురై అతలాకుతలం అయ్యాయి.
తుపాను తాకిడి ప్రాంతాల్లో కేంద్ర పరిశీలక బృందం పర్యటించి పరిస్థితిని పరిశీలించింది. కేంద్ర పరిశీలకులు బుధవారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును, రాష్ట్ర ఉన్నతాధికారులను కలుసుకున్నారు. తుపాను తాకిడి ప్రాంతాల బాధితుల కోసం ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కూడాఅందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తుపాను తాకిడి ప్రాంతాల్లో నష్టంఅపారంగానే ఉన్నదని, తాము వెంటనే కేంద్రానికి తమ నివేదికను సమర్పిస్తామని కేంద్ర పరిశీలకులు చెప్పారు.
Comments
Story first published: Wednesday, January 21, 2004, 23:53 [IST]