ఓటమి భయంతో కాంగ్రెస్ పొత్తులుః బాబు
వర్షం కారణంగా మ్యాచ్ చాలా సేపు ఆగిపోవడంతో 34 ఓవర్లలో ఆస్ట్రేలియా 224 పరుగులను ఛేదించాల్సి వచ్చింది. గిల్క్రిస్, రికీ పాంటింగ్ ఆడుతున్న సమయంలో విజయం ఆస్ట్రేలియాకు నల్లేరు మీద నడకే అనిపించింది. అయితే ఆ తర్వాత ఇర్ఫాన్ పఠాన్ వరుసగా రెండు వికెట్లను తీయడంతో ఆట మలుపు తిరిగింది.
గిల్క్రిస్ట్ 95 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మురళీ కార్తిక్ బౌలింగ్లో అవుట్ కావడంతో పూర్తిగా మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడిపోతుండడంతో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. గంగూలీ మూడు వికెట్లను తీయడంతో పాటు ఒక రనవుట్ కూడా చేశాడు. ఈ స్థితిలో మ్యాచ్ ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ చోటు చేసుకుంది. చివరి ఓవర్లో బ్రెట్లీ సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ను ఆస్ట్రేలియా గెలుచుకోగలిగింది. అయితే పార్థివ్ పటేల్ సులభమైన స్టంప్ అవుట్ను మిస్ చేశాడు. దీనికితోడు అగార్కర్, బాలాజీ వైడ్లు చాలా ఇచ్చారు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్తో ఇన్నింగ్స్ను ప్రారంభించిన కెప్టెన్ గంగూలీ ఒక పరుగుకే అవుటయ్యాడు. ద్రావిడ్ కూడా కొద్ది సేపట్లోనే వెనుదిరిగాడు. పార్థివ్ పటేల్ 28 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ స్థితిలో హైదరాబాద్ ఆటగాడు వివియస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్ రికార్డు భాగస్వామ్యంతో స్కోర్ను వేగంగా పరిగెత్తించారు. యువరాజ్ సింగ్ ఆస్ట్రేలియా బౌలర్లను చీల్చి చెండాడు. 122 బంతుల్లో 139 పరుగులు చేశాడు. లక్ష్మణ్ నిలకడగా ఆడి సెంచరీ పూర్తి చేశాడు. అద్భుతమైన సెంచరీతో భారత్ భారీ స్కోర్ చేయడానికి తోడ్పడిన యువరాజ్ సింగ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.