ఓటమి భయంతో కాంగ్రెస్ పొత్తులుః బాబు
హైదరాబాద్: జూనియర్ డాక్లర్లు తమ సమ్మెనుకొనసాగిస్తున్నారు. వారి సమ్మె గురువారంనాటికి 42వ రోజుకుచేరుకుంది. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిజూనియర్ డాక్టర్ల సమ్మెకు కేంద్ర బిందువుగామారింది.
జూనియర్ డాక్టర్లు గురువారంనాడుహైదరాబాద్లో జి.వో.90 ప్రతిని దగ్ధంచేశారు. ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశంమాజీ శాసనసభ్యుడు శ్రీపతి రాజేశ్వర్ను ఘెరావ్చేశారు. ఈ సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులనుతొలగించే ప్రయత్నం చేసినప్పుడు ఘర్షణచోటు చేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ఒకవిద్యార్థిపై చేయి చేసుకోవడం ఉద్రిక్తతకుదారి తీసింది. సిఐ క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్చేశారు. పోలీసులు సర్ది చెప్పడంతో గొడవసద్దుమణిగింది.
ఇదిలా వుంటే, విజయవాడ ప్రభత్వ ఆస్పత్రివద్ద జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతుగాతొమ్మిది వామపక్షాలు ధర్నా నిర్వహించాయి.జూనియర్ డాక్టర్ల డిమాండ్లను తీర్చాలని వామపక్షాలు డిమాండ్చేశాయి.