వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముంబాయిలో మహిళలపై యాసిడ్ దాడి
ముంబాయిః లోకల్రైలులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలపై కొందరు ఆగంతకులు శనివారం ఉదయం యాసిడ్ చల్లారు. గాయపడిన ముగ్గురు మహిళలుమాన్షి షింగార్ పురె, షిర్లీ థామస్, సునీత ప్రసన్నలు ఐసిఐసిఐ బ్యాంకు ఉద్యోగినులు.భాంద్రా, ఖార్ స్టేషన్ల మధ్య దుండగులు వీరిపై యాసిడ్ పోశారు.
వీరిలో ఒకరు గర్భవతి. గాయపడినవీరిని బాంద్రాలోని బాబా ఆస్పత్రిలో చేర్చారు. వీరికి ఐదువేల రూపాయల నష్టపరిహారాన్నిరైల్వే అధికారులు ప్రకటించారు. వీరిలో ఒకరి పరిస్ధితి ప్రమాదకరంగా ఉన్నట్టు తెలిసింది. యాసిడ్ దాడిలోస్వల్పంగా గాయపడిన సైఫుల్లా రహ్మతుల్లాను నిందితుల గుర్తింపు కోసం పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Story first published: Saturday, January 31, 2004, 23:53 [IST]