వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రిలయెన్స్ వ్యతిరేక ఆందోళన ముమ్మరం
దుబాయ్: హజ్ యాత్ర తొక్కిసలాటలో ఇద్దరు భారతీయులతో పాటు పలువురు మరణించారు. సౌదీఅరేబియాలోని మక్కా సమీపంలోని మీనా వద్ద హజ్ యాత్ర సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో మరణించినవారెంత మంది అనేది లెక్క లేలడం లేదు. అయితే 244 మంది దాకా మరణించి ఉంటారనేది ఒక అనధికారఅంచనా.
మరణించిన భారతీయులను కేరళలోని కొజికోడ్కు చెందిన మొహమ్మద్ అలీ (40), జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్కు చెందిన మొహమ్మద్ అబ్దుల్లాలుగా గుర్తించినట్లు జెద్దాలోని ఇండియన్ కాన్సుల్ జనరల్ సయ్యద్అక్బరుద్దీన్ చెప్పారు. పోలీసులు, వైద్య సిబ్బంది సహాయక చర్యలు చెప్పారు.సైతాన్పై రాళ్లు విరిసే కార్యక్రమం సందర్భంగా ఈ తొక్కిసలాట సంభవించినట్లు ఆయన తెలిపారు. దాదాపు 20 లక్షల మంది అక్కడ గుమికూడినట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Sunday, February 1, 2004, 23:53 [IST]