వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రిలయెన్స్ వ్యతిరేక ఆందోళన ముమ్మరం
కడప: కాంగ్రెస్ అసమ్మతి అనాయకుడు డాక్టర్ఎం.వి. మైసురారెడ్డికి, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) మాజీ నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి మధ్య రహస్య మంతనాలు జరిగాయి. ఇరువురు నాయకులు కడప జిల్లా పులివెందులలో ఆదివారం రహస్యంగా సమావేశమయ్యారు.
ఒక పెళ్లికిహాజరైన ఇరువురు నేతులు వై.యస్. రాజశేఖర్ రెడ్డి సన్నిహితుల చొరవతో రహస్య సమాలోచనలు జరిపారు. వారిరువురి మధ్య కుదిరిన ఒప్పందాలేమిటనేది తెలియదు. అయితే మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మైసురారెడ్డివిలేకరులతో చెప్పారు. వైయస్తో ప్రధానాంశాలపై చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Sunday, February 1, 2004, 23:53 [IST]