వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసమ్మతి సమసినట్లే: వైయస్సార్హైదరాబాద్: కాంగ్రెస్ కడప జిల్లా నేతల అసమ్మతి సమసిపోయినట్లేనని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) మాజీ నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. సమస్య కొంత ఉంటూ మీడియా కొండంత చేసిందని ఆయన సోమవారంవిలేకరులతో అన్నారు. అసమ్మతి నేత డాక్టర్ఎం.వి. మైసురారెడ్డి, రాజశేఖర్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. వారిద్దరు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ను కలుసుకుంటారు. అధిష్ఠానం వద్ద తమ సమస్యలనువినిపించుకోవడం తప్పేమీ కాదని రాజశేఖర్ రెడ్డి అన్నారు. తాను సమస్యఅసలే లేదని అనడం లేదని, అయితే కొద్దిగా ఉన్న సమస్యను మీడియా ఎక్కువ చేసి చూపిందని ఆయన అన్నారు. కడప లోక్సభసీటును మైసురారెడ్డి ఆశిస్తున్నట్లు తనకు తెలియదని ఆయన అన్నారు.
నిజామాబాద్:బ్రిటన్లో ముగ్గురు ఆంధ్రులు అనుమానస్పద స్థితిలో మరణించారు. వైద్య దంపతులు, వారి కుమారుడు హత్యకుగురైనట్లు భావిస్తున్నారు. దొంగలు వారిని హత్య చేసినట్లు భావిస్తున్నారు.
నిజామాబాద్కు చెందిన జయప్రకాశ్, ఆయన భార్య అనుపమ, వారి కుమారుడు ప్రణవ్బ్రిటన్లోని సఫ్ఫోక్ సిటీలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ వైద్య దంపతులు గత 15 యేళ్లుగాబ్రిటన్లో ఉంటున్నారు. జయప్రకాశ్ తండ్రి జలపతిరావు నిజామాబాద్లో వైద్యవృత్తిలో ఉన్నారు. తమ కుటుంబసభ్యుల మరణవార్త తనకు ఆదివారం రాత్రి తెలిసిందని జలపతిరావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఏం జరిగిందనేది తనకు పూర్తివివరాలు తెలియరాలేదని ఆయన అన్నారు.
Story first published: Monday, February 2, 2004, 23:53 [IST]