వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసమ్మతి సమసినట్లే: వైయస్సార్హైదరాబాద్: కాంగ్రెస్ కడప జిల్లా నేతల అసమ్మతి సమసిపోయినట్లేనని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) మాజీ నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. సమస్య కొంత ఉంటూ మీడియా కొండంత చేసిందని ఆయన సోమవారంవిలేకరులతో అన్నారు. అసమ్మతి నేత డాక్టర్ఎం.వి. మైసురారెడ్డి, రాజశేఖర్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. వారిద్దరు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ను కలుసుకుంటారు. అధిష్ఠానం వద్ద తమ సమస్యలనువినిపించుకోవడం తప్పేమీ కాదని రాజశేఖర్ రెడ్డి అన్నారు. తాను సమస్యఅసలే లేదని అనడం లేదని, అయితే కొద్దిగా ఉన్న సమస్యను మీడియా ఎక్కువ చేసి చూపిందని ఆయన అన్నారు. కడప లోక్సభసీటును మైసురారెడ్డి ఆశిస్తున్నట్లు తనకు తెలియదని ఆయన అన్నారు.
హైదరాబాద్ః తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నట్టు లక్ష్మీపార్వతి ప్రకటించారు.
ఎన్టీఆర్ ను గద్దె దింపే కుట్రలో కీలక పాత్రధారిఅయిన మాజీ స్పీకరు యనమల రామకృష్ణుడిని ఓడించి, ఎన్టీఆర్ కు ఆత్మశాంతి కలిగించాలన్నది తన ధ్యేయమని ఆమె అన్నారు. ఎన్టీఆర్ ను అప్రజాస్వామికంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారని,అప్పటి స్పీకరు యనమల రామకృష్ణుడు వైస్రాయ్ హోటల్ లో కూర్చుని ఎమ్మెల్యేల ఫోర్జరీ సంతకాలను పరిగణనలోకి తీసుకున్నారని ఆమె ఆరోపించారు. ఎన్టీఆర్ కు మోసం చేసిన వాళ్ల చరిత్రలను బయటపెడతానని ఆమె అన్నారు.
Comments
Story first published: Monday, February 2, 2004, 23:53 [IST]