వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌పై పోటీకి రెడీ:విజయశాంతి

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల నుంచి నక్సలైట్లను తరిమి కొట్టాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. వరంగల్‌ జిల్లా మేడారం సమ్మక్క సారలక్కలకు ఆయన సోమవారం గిరిజన సంప్రదాయ పద్ధతిలో మొక్కలు సమర్పించుకున్నారు.

తాడ్వాయి మండలానికి సమ్మక్క సారలక్కపేరు పెట్టనునట్లు ఆయన తెలిపారు. గిరిజన ప్రాంతాలకు 2 కోట్ల 75 లక్షల ప్యాకేజీని రూపొందించామని, నక్సల్స్‌ను తరిమికొడితే ఈ ప్యాకేజీని సక్రమంగా అమలు చేయడానికి వీలవుతుందని ఆయన చెప్పారు. సమ్మక్క సారలక్కలు ఆదర్శం కావాలని ఆయన అన్నారు. తన ప్రాణత్యాగం వల్ల రాష్ట్రంలోపేదరికం పోతుందనుకుంటే అందుకు తాను సిద్ధమేనని ఆయన అన్నారు. నక్సల్స్‌ కరుడు గట్టిన సిద్ధాంతాలతో అమాయకులను చంపుతున్నారని ఆయనవిమర్శించారు. నక్సలైట్లపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X