వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసమ్మతి సమసినట్లే: వైయస్సార్హైదరాబాద్: కాంగ్రెస్ కడప జిల్లా నేతల అసమ్మతి సమసిపోయినట్లేనని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) మాజీ నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. సమస్య కొంత ఉంటూ మీడియా కొండంత చేసిందని ఆయన సోమవారంవిలేకరులతో అన్నారు. అసమ్మతి నేత డాక్టర్ఎం.వి. మైసురారెడ్డి, రాజశేఖర్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. వారిద్దరు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ను కలుసుకుంటారు. అధిష్ఠానం వద్ద తమ సమస్యలనువినిపించుకోవడం తప్పేమీ కాదని రాజశేఖర్ రెడ్డి అన్నారు. తాను సమస్యఅసలే లేదని అనడం లేదని, అయితే కొద్దిగా ఉన్న సమస్యను మీడియా ఎక్కువ చేసి చూపిందని ఆయన అన్నారు. కడప లోక్సభసీటును మైసురారెడ్డి ఆశిస్తున్నట్లు తనకు తెలియదని ఆయన అన్నారు.
హైదరాబాద్: తాము అధికారంలోకి వస్తే రైతులు, రైతు కూలీలు, మహిళల కోసం స్థానిక బ్యాంక్లు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) మాజీ నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. రైతులు, రైతు కూలీల సదస్సుల్లో ఆయన ఆదివారం ప్రసంగించారు.
తాము అధికారంలోకి వస్తే రైతులకు, రైతు కూలీలకు, మహిళలకు అధికప్రాధాన్యం ఇచ్చి కార్యక్రమాలు చేపడుతామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే 40 వేల ఎస్సి, ఎస్టి, 70 వేల బిసి బ్యాక్లాగ్ పోస్టులను నిర్ణీత కాలవ్యవధిలో భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. బిజెపి, తెలుగుదేశం పాలనల్లో వ్యవసాయ రంగం నిర్వీర్యమైందని ఆయనవిమర్శించారు. రైతుకు ఎకరానికి ఐదు వేల రూపాయలవిలువ చేసే ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని, కూలీలకు 180 రోజుల పని విధానాన్ని అమలులోకి తెస్తామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Monday, February 2, 2004, 23:53 [IST]