వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ క్రికెట్ పర్యటనకుఆమోదం
కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుపై సోమవారం సాయంత్రం దాడి చేసిన వారు ఆయన గన్ మెన్ ఇద్దరిని, ఎన్ ఎస్ యుఐ నాయకుడిని కాల్చి చంపి ఆయుధాలు తీసుకెళ్ళిన విషయం తెలిసిందే. కృష్ణారావు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా ఆయనను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.
ఎమ్మెల్యేగా ప్రభుత్వయంత్రాంగంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన జూపల్లి కృష్ణారావునక్సలైట్ల టార్గెట్ లో లేరు. అయినా ఈ దాడిఎందుకు జరిగిందో స్ధానిక నాయకులకు అర్ధం కావడంలేదు. ఇది నక్సలైట్ల దాడి కాదని, రాజకీయ ప్రత్యర్ధుల పనిఅయి ఉంటుందని స్ధానిక కాంగ్రెస్ నాయకులు అనుమానిస్తున్నారు.తాను నక్సలైట్ల టార్గెట్ లో లేనని, ఆయుధాల కోసమే తనగన్ మెన్ లను హతమార్చి ఉంటారని కృష్ణారావుఅంటున్నారు.
Comments
Story first published: Tuesday, February 3, 2004, 23:53 [IST]