వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంద్రగోళం మధ్య లోక్‌ సభలో బడ్జెట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

పెర్త్‌: బౌలర్ల ధాటితో జింబాబ్వేతో జరిగినవిబి సిరీస్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. జింబాబ్వే భారత్‌ ముందు ఉంచి 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి భారత బ్యాట్స్‌మెన్‌ తంటాలు పడ్డారు. చివరకు నాలుగువికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్నారు. నాలుగువికెట్లతో జింబాబ్వే బ్యాటింగ్‌ ఆర్డర్‌ను తుత్తునియలు చేసిన భారత యువ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

భారత్‌ టాప్‌ ఆర్డర్‌ను కూల్చడంలో జింబాబ్వేవిజయం సాధించినప్పటికీ లక్ష్యం తక్కువ కావడంతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. సచిన్‌ టెండూల్కర్‌ మూడు పరుగులకే అవుటయ్యాడు.సెహ్వాగ్‌ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అయితే ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయాడు. 23 పరుగలు వ్యక్తిగత స్కోర్‌ వద్దపెవిలియన్‌ దారి పట్టాడు. లక్ష్మణ్‌ 32 పరుగులు చేసి క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. బదాని 34 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. అవగాహనా లోపంతో రోహన్‌ గవాస్కర్‌ రన్నవుట్‌ అయ్యాడు. బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టినప్పటికీ జింబాబ్వే బౌలర్లు ఎక్స్‌ట్రాలు చాలా ఇచ్చారు. క్యాచ్‌లు కూడా వదిలేశారు. బ్లిగ్నాట్‌,ఎర్విన్‌లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. హీత్‌స్ట్రీక్‌ ఒక వికెట్‌ తీసుకున్నాడు. ఈ సిరీస్‌లో ఒక విజయాన్ని కూడాఅందుకోకుండా జింబాబ్వే వెనుదిరగాల్సి వచ్చింది.

పెర్త్‌లోనిబౌన్సీ పిచ్‌పై భారత్‌ బౌలర్లు విజృంభించారు.ఇప్పటికే వరుస అపజయాలతో కుదేలైనజింబాబ్వేని కోలుకోని విధంగా34.4 ఓవర్లలో135 పరుగులకే ఆలౌట్‌ చేశారు. మంగళవారంజింబాబ్వే-భారత్‌ల మధ్య జరిగిన ఆఖరి లీగ్‌మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌దేఆధిపత్యమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నజింబాబ్వే..త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది.

ఇర్ఫాన్‌ పటాన్‌ విరుచుకుపడి ఓపెనర్లు ఇద్దరినీ డకౌట్‌ చేశాడు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ ఇబ్రహీంను కూడా పటాన్‌ ఏడు పరుగులకేపెవిలియన్‌ దారి పట్టించాడు. కర్లిస్లీ, ఇర్వీన్‌లు పోరాడినా,పెద్దగా స్కోర్‌ సాధించలేకపోయారు. చివర్లో మత్సీకెన్యారీ పోరాడి జింబాబ్వే 100 పరుగుల స్కోర్‌ దాటేలా చేశాడు. పటాన్‌ నాలుగువికెట్లు తీసుకోగా, భండారీ మూడు తీసుకున్నారు.

ఈ మ్యాచ్‌లో భారత్‌ కెప్టెన్‌ గంగూలీతో పాటు అజిత్‌అగార్కర్‌, మురళీ కార్తీక్‌ విశ్రాంతి తీసుకున్నారు. రాహూల్‌ ద్రావిడ్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X