గంద్రగోళం మధ్య లోక్ సభలో బడ్జెట్
కాంగ్రెస్తో పొత్తుకు తాము తలుపులు మూసేశామని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు బుధవారం తేల్చి చెప్పారు. ఇటీవలి దాకా కాంగ్రెస్ నాయకులతో ఫోన్లో మాట్లాడుతున్న విషయం నిజమేనని ఆయన అంగీకరించారు. తాము ఇక నిరీక్షించే స్థితిలో లేమని ఆయన చెప్పారు. పొత్తుల చర్చ ముందుకు వచ్చినప్పటి నుంచి పార్టీకి చాలా నష్టం జరిగిందనే అభిప్రాయం టిఆర్ఎస్లో నెలకొంది. కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జై తెలంగాణ అని ఎవరు ముందుకు వస్తే వారితో కలిసి పని చేస్తామని, వారే తమ ఆత్మీయులు, బంధువులు అని, తెలంగాణనే తమ ప్రస్తుత సిద్ధాంతమని కెసిఆర్ అన్నారు.
ఈ నెల 11వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని కెసిఆర్ చెప్పారు. అదే రోజు అభ్యర్థుల తొలి జాబితా వెలువరించే అవకాశాలున్నాయని కూడా ఆయన చెప్పారు. ఈ నెల 5,6,7,8 తేదీల్లో అభ్యర్థుల ఎంపికపై సర్వేలు జరుగుతాయని, 9,10 తేదీల్లో పార్టీ ఎన్నికల సంఘం సమావేశమవుతుందని, అందులో తొలి జాబితా ఖరారవుతుందని ఆయన చెప్పారు.