వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మేడారం జాతర నేటితో ముగింపు
హైదరాబాద్ః ఎన్టీఆర్ అల్లుడు,మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసేందుకు రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ఎనిమిదో తేదీన ఆయన సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
ఆయన కాంగ్రెస్ లో చేరడం వల్ల ప్రకాశం జిల్లాలోనే గాక కోస్తాలోని అనేక జిల్లాల్లో ఉన్న ఆయన అనుచరులు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన నారా రామ్మూర్తి నాయుడుతో సుదీర్ఘ మంతనాలు జరిపిన అనంతరం దగ్గుబాటి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. దగ్గుబాటి కాంగ్రెస్ టికెట్ పై ప్రకాశం జిల్లాలోని ఏదో ఒకఅసెంబ్లీ స్ధానానికి పోటీ చేయాలనుకుంటున్నారు.
Story first published: Saturday, February 7, 2004, 23:53 [IST]