రిలయెన్స్ వ్యతిరేక ఆందోళన ముమ్మరం
హైదరాబాద్: తెలుగుదేశం ఎంపీ కె.శ్రీనివాసులు వార్ అమర్చిన క్లైమోర్మైన్ వల నుంచి తృటిలో క్షేమంగా బయటపడగలిగారు. ఎంపీ శ్రీనివాసులు తన ఇద్దరు సహచరులతో కలిసి ప్రయాణిస్తుండగా, అనంతపూరం జిల్లా కుంతిమట్టి వద్ద ఆదివారం పీపుల్స్వార్ క్లైమార్మైన్ను పేల్చింది. వీరు క్షేమంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు.
ఇద్దరు నక్సలైట్లు ఫ్లాష్ కెమెరాలతో మందుపాతర పేల్చినట్లు సమాచారం. అనంతపురం జిల్లా పెనుకొండ మాజీ శాసనసభ్యుడు పరిటాల రవీంద్ర నిర్వహించ తలపెట్టిన సామూహిక వివాహాల కార్యక్రమానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. టిఫిన్ చేయడానికి కాల్వ శ్రీనివాసులు తన సహచరులతో ఒక హోటల్ వద్ద ఆగడంతో నక్సలైట్లకు పక్కా సమాచారం అందినట్లు భావిస్తున్నారు. మందుపాతర పేల్చిన సంఘటనలో శ్రీనివాసులు అనుచరులు, తెలుగుదేశం నాయకులు సాలార్ బాషా, ఆదినారాయణ గాయపడ్డారు. దాడి నుంచి బయటపడిన తెలుగుదేశం నాయకులు నేరుగా పరిటాల నిర్వహిస్తున్న సామూహిక వివాహాల కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు.
కాల్వ శ్రీనివాసులుపై దాడి చేసిన నక్సలైట్ల వేట కోసం హైదరాబాద్ నుంచి బలగాలను పంపించారు. నక్సలైట్ల టార్గెట్లో ఉన్న నాయకులకు తగిన భద్రత కల్పిస్తామని పోలీసు డైరెక్టర్ జనరల్ సుకుమార చెప్పారు. తెలుగుదేశం నాయకులపై నక్సల్స్ దాడి చేసిన వెంటనే ఆ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ చర్యలు చేపట్టారు.
కాల్వ శ్రీనివాసులుపై నక్సలైట్లు చేసిన దాడిని తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో తీవ్రంగా ఖండించింది. తమ పార్టీ నేతలపై నక్సలైట్లు దాడులు చేస్తూ హత్యలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆదివారం విలేకరుల సమావేశంలో అన్నారు. తిరుపతిలోని అలిపిరి వద్ద ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై నక్సలైట్లు చేసిన దాడిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.