వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్పంచ్‌ ల ఆగ్రహంః కందాహామీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం కేసులో ఆరెస్టయిన ఇద్దరు పోలీసు అధికారులను 30 రోజుల పాటు జ్యుడిష్యల్‌ కస్టడీకి రిమాండ్‌ చేస్తూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ స్టాంపు పేపర్ల కుంభకోణం కేసు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఆదివారంనాడు డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్‌ (డిఎస్‌పి) సత్యనారాయణ రెడ్డిని, సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుమోహన్‌ను అరెస్టు చేసింది. స్టాంపు పేపర్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన తెల్గీకి సహకరించారనే ఆరోపణపై సిట్‌ బృందం వారిద్దరిని అరెస్టు చేసింది. ఈ ఇద్దరిని సిట్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి జగన్నాథ్‌ రెడ్డి ముందు హాజరు పరిచింది. మార్చి 8వ తేదీ వరకు వారిని జ్యుడిష్యల్‌ కస్టడీకి రిమాండ్‌ చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు.

స్టాంపు పేపర్ల కుంభకోణంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు ముగ్గురు పోలీసులు అరెస్టయ్యారు. మారేడుపల్లి హెడ్‌ కానిస్టేబుల్‌ కె.పి. రెడ్డిని సిట్‌ బృందం గత నెల అరెస్టు చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X