వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్పంచ్‌ ల ఆగ్రహంః కందాహామీ

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌)తో చర్చలు జరిపామని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ చెప్పారు. ఇందులో దాపరికమేమీ లేదని ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు.

టిఆర్‌ఎస్‌తో సీట్ల సర్దుబాటు జరగాల్సి ఉన్నదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వెనకబడిన తరగతుల (బిసి) నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడా, కాదా అనేది ప్రస్తుత ప్రస్తావన కాదని ఆయన అన్నారు. కేంద్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ)ని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఓడించడం ప్రధాన కర్తవ్యమని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే శాసనసభ్యులే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి అన్నారు. తాము ముఖ్యమంత్రి పదవికి రేసులో లేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన డాక్టర్‌ ఎం.వి. మైసురారెడ్డితో జరిగిన చర్చల వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X