వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్పంచ్‌ ల ఆగ్రహంః కందాహామీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: డాక్టర్‌ ఎం.వి. మైసురారెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి సమర్పించిన రాజీనామాను ఉపసంహరించుకుంటారని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ అశాభావం వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం చేసేవారిని, పార్టీని వెన్నుపోటు పొడిచే వారిని ఉద్దేశించి మాత్రమే తాము సంఘబహిష్కారం విధించాలని పిలుపునిచ్చామని, మైసురారెడ్డిని ఉద్దేశించి అలా అనలేదని ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చారు.

ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వారసత్వాన్ని లాక్కున్నారని శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. అటువంటి చంద్రబాబుకు సోనియా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. ఎన్టీఆర్‌ అల్లుడు కాబట్టే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారని, లేకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయి వుండేవారు కారని ఆయన అన్నారు. చోటామోటా నాయకుడు అయిన చంద్రబాబు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రి అయ్యారని, మంత్రి అయ్యారు కాబట్టే ఎన్టీఆర్‌ చంద్రబాబును తన అల్లుడిగా చేసుకున్నారని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X