వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేడు లక్ష్మణ్ రిసెప్షన్ కు క్రికెటర్లు
ఒంగోలు/నల్లగొండ: తమను తిరిగి గెలిపిస్తే స్వర్ణాంధ్ర సాధిస్తామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా కందుకూరు, నల్లగొండ జిల్లా కోదాడలలో జరిగిన జెండా పండుగల్లో ఆయన మంగళవారం పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభల్లో ప్రసంగించారు.
పాత కాలం సిద్ధాంతాలతో వామపక్షాలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. తాము అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో వామపక్షాలు ఆడపడుచులకు ఏం చేశాయని ఆయన ప్రశ్నించారు. తుపాకితో రాజ్యం చేయలేరని ఆయన నక్సలైట్లను ఉద్దేశించి అన్నారు. నక్సల్స్ అహింసా మార్గంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Story first published: Tuesday, February 10, 2004, 23:53 [IST]