వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు లక్ష్మణ్‌ రిసెప్షన్‌ కు క్రికెటర్లు

By Staff
|
Google Oneindia TeluguNews

ఒంగోలు/నల్లగొండ: తమను తిరిగి గెలిపిస్తే స్వర్ణాంధ్ర సాధిస్తామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా కందుకూరు, నల్లగొండ జిల్లా కోదాడలలో జరిగిన జెండా పండుగల్లో ఆయన మంగళవారం పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభల్లో ప్రసంగించారు.

గత ఐదేళ్లలో స్వర్ణాంధ్ర సాధనకు పునాదులు వేసుకున్నామని, తిరిగి అధికారం ఇస్తే స్వర్ణాంధ్ర సాధిస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్‌, వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితులపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. సోనియా గాంధీ విదేశీయతను ప్రధాన విమర్శనాస్త్రంగా చేసుకున్నారు. తమకు తిరిగి అధికారం ఇస్తే యువతకు నాలుగు శాతం వడ్డీకే అప్పులిస్తామని, ఇందుకు ఒక ప్యాకేజీని ప్రకటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తమ పార్టీ బలహీనవర్గాలకు, మహిళలకు ఎంతో చేసిందని, కాంగ్రెస్‌ ఏనాడూ బలహీనవర్గాలను పట్టించుకోలేదని ఆయన అన్నారు. తమ పార్టీ రైతుల వెంటే ఉంటుందని ఆయన చెప్పారు.

పాత కాలం సిద్ధాంతాలతో వామపక్షాలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. తాము అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌, కేరళ రాష్ట్రాల్లో వామపక్షాలు ఆడపడుచులకు ఏం చేశాయని ఆయన ప్రశ్నించారు. తుపాకితో రాజ్యం చేయలేరని ఆయన నక్సలైట్లను ఉద్దేశించి అన్నారు. నక్సల్స్‌ అహింసా మార్గంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X