రిలయెన్స్ వ్యతిరేక ఆందోళన ముమ్మరం
చెన్నై: వచ్చే లోక్సభ ఎన్నికల్లో బిజెపి, దాని మిత్రపక్షాలకు వ్యతిరేకంగా కచ్చితమైన తీర్పు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తమిళనాడు ప్రజలనుకోరారు. మాజీ కాంగ్రెస్ నాయకుడు స్వర్గీ కె. కామరాజ్విగ్రహాన్ని ఆమె శుక్రవారం ఆవిష్కరించి అనంతరం ప్రసంగించారు.
వచ్చే చారిత్రాత్మక ఎన్నికల్లో మతశక్తుల నుంచి శాంతిని కాపాడడమేపెద్ద సవాల్ అని, ఆ శక్తుల నుంచి మహాత్మాగాంధీ దేశాన్ని పరిరక్షించుకోవాలని ఆమె అన్నారు.సేవారాజకీయాలను, సామాన్యుల పట్ల పట్టింపు ఉండే రాజకీయాలను, ప్రభుత్వంలో పారదర్శక పాటించే రాజకీయాలను, సుపరిపాలనా రాజకీయాలను పునరుద్ధరించడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి కామరాజ్ యుగాన్ని స్థాపించాల్సి ఉన్నదని ఆమె అన్నారు.
కావేరీ వివాదాన్ని పరిష్కరించడంలో కావేరీ రివర్ అథారిటీ చైర్మన్గా ప్రధాని వాజ్పేయివిఫలమయ్యారని, దీంతో కావేరీ డెల్టా ఎడారిగా మారిందని ఆమె అన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవివాదానికి ఇరు రాష్ట్రాల రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా పరిష్కారం కనుక్కుంటామని ఆమె హామీ ఇచ్చారు.