వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దగ్గుబాటి నోట ప్రత్యేక ఆంధ్ర మాట

By Staff
|
Google Oneindia TeluguNews

వారణాసి: భారతీయ జనతా పార్టీ (బిజెపి నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా ధ్వజమెత్తారు. దేశానికి అన్నిఅరిష్టాలను ఎన్‌డిఎ ప్రభుత్వం కొని తెచ్చిందని ఆమె దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని పలు బహిరంగ సభల్లో ఆమె గురువారం ప్రసంగించారు.

కాంగ్రెస్‌ను గెలిపిస్తే దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఎన్‌డిఎ ప్రభుత్వ విధానాలతో ఏ ఒక్కరు కూడా సంతృప్తిగా లేరని ఆమె అన్నారు. దేశం ఎదుర్కుంటున్న సమస్యలకు ఎన్‌డిఎ ప్రభుత్వమే కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే దేశాన్ని రక్షిస్తుందనే నినాదాన్ని ఆమె పదేపదే వల్లించారు. సోనియా గాంధీ రోడ్డు యాత్ర సందర్భంగా ప్రజలు ఇరు వైపులా నిల్చుని అభివాదం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X