వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రిలయెన్స్ వ్యతిరేక ఆందోళన ముమ్మరం
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు నాలుగు దశల్లో జరిగే అవకాశాలున్నాయి. ఈవిషయాన్ని ఎన్నికల కమీషన్ సూచనప్రాయంగా తెలియజేసింది.
ఎన్నికలు నాలుగు దశల్లో జరిగవచ్చునని ఎన్నికల కమీషన్ అధికార ప్రతినిధి ఎ.ఎన్. ఝావిలేకరులతో చెప్పారు. ఎన్నికల కమీషన్ గత రెండు మూడు రోజులుగా వరుస సమావేశాలు జరుపుతోంది. లోక్సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఒక ఉత్తరప్రదేశ్లోమినహా మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్ నిర్వహించడం బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్నికల తేదీలను కమీషన్ ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. శుక్రవారంనాడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల కమీషన్ సమావేశం నిర్వహించింది. పండుగలను, పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీలను నిర్ణయించాలని రాజకీయ పార్టీలుకోరాయి.
Comments
Story first published: Friday, February 20, 2004, 23:53 [IST]