వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయభేరికి ఏర్పాట్లు పూర్తి

By Staff
|
Google Oneindia TeluguNews

మెల్‌బోర్న్‌: విబి వన్డే సిరీస్‌ ఆస్ట్రేలియా వశమైంది. రెండో ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘోరంగా పరాజయం పాలైంది. వరుసగా రెండు ఫైనల్‌ మ్యాచ్‌ల్లోనూ భారత్‌ ఓడిపోవడంతో విబి సిరీస్‌ ఆస్ట్రేలియా చేజిక్కించుకుంది.

లీగ్‌ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇచ్చిన భారత్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో చతికిలబడింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కుప్పకూలడంతో ఆస్ట్రేలియాకు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. ఆదివారం జరిగిన రెండో ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఉంచిన 360 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక భారత్‌ కుప్పకూలింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఒక్కరొక్కరే పెవిలియన్‌ దారి పట్టారు. టెయిల్‌ ఎండర్లు కొద్దిగా ప్రతిఘటించినప్పటికీ లాభం లేకపోయింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి నిర్ణీత 50 ఓవర్లలో 359 పరుగులు చేసింది. భారత బౌలర్లను ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ చితికబాదారు. ఇర్ఫాన్‌ పఠాన్‌ రెండు వికెట్లు, నెహ్రా రెండు వికెట్లు తీసుకున్నారు. అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరదకు బ్రేక్‌ వేయడంలో భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. హెడెన్‌ సెంచరీ చేశాడు. హెడెన్‌ 126 పరుగులు చేయగా సైమండ్స్‌ 66 పరుగులు, మార్టిన్‌ 67 పరుగులు చేశారు.

ఆస్ట్రేలియా ఉంచిన లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత ఓపెనర్లు ధాటిగా ప్రారంభించినప్పటికీ సెహ్వాగ్‌ 12 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద అవుట్‌ అయ్యాడు. అప్పటి నుంచి భారత వికెట్లు క్రమం తప్పకుండా కూలిపోతూ వచ్చాయి. సచిన్‌ టెండూల్కర్‌ 27 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆస్ట్రేలియాకు సింహస్వప్పంగా మారిన హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ వివియస్‌ లక్ష్మణ్‌ రెండు ఫైనల్‌ మ్యాచ్‌ల్లోనూ చేతులెత్తేశాడు. ఆదివారంనాటి మ్యాచ్‌లో ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ దారి పట్టాడు. పఠాన్‌ 30 పరుగులు చేశాడు. భారత్‌ 33.2 ఓవర్లలో 151 పరుగులు చేసి ఆల్‌ అవుట్‌ అయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X