వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు లక్ష్మణ్‌ రిసెప్షన్‌ కు క్రికెటర్లు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సీట్ల సర్దుబాటుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) పెట్టిన గడువుతో సంబంధం లేదని కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ అన్నారు. టిఆర్‌ఎస్‌, కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులు ఖరారు చేసేందుకు ఆయన మంగళవారం హైదరాబాద్‌ వచ్చారు.

వామపక్షాలతో చర్చలకు ముందు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సిఎల్‌పి) మాజీ నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి, ఇతర సీనియర్‌ నేతలతో ఆజాద్‌ మాట్లాడారు. గులాం నబీ ఆజాద్‌ మాత్రం మంగళవారం తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమయ్యారు. టిఆర్‌ఎస్‌కు 40 శాసనసభ స్థానాలకు, 4 లోక్‌సభ స్థానాలకు లేదా 38 శాసనసభా స్థానాలకు, 5 లోక్‌సభ స్థానాలకు మించి ఇచ్చేది లేదని ఆజాద్‌ అన్నారు. దీనికి అంగీకరించకపోతే వామపక్షాలతో పొత్తు కుదుర్చుకుని ముందుకు సాగుతామని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం లోగా కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ల మధ్య పొత్తు ఖరారు కావచ్చునని సమాచారం. శ్రీనివాస్‌, రాజశేఖర్‌ రెడ్డి సిపిఐతో జరిపిన చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X