విజయభేరికి ఏర్పాట్లు పూర్తి
విజయవాడ: కాంగ్రెస్ దొంగనాటకాలు ఆడుతోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. పార్టీ జెండా పండుగ ముగింపు సందర్భంగా ఆయన ఆదివారంవిజయవాడలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన రాష్ట్రంలోనిప్రతిపక్షాలపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఆల్మట్టి ఎత్తు పెంచడాన్ని సమర్థిస్తూ, పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)తో పొత్తుపెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ దొంగ నాటకాలు ఆడుతోందని ఆయన అన్నారు. విశాలాంధ్ర,సమైక్యాంధ్రల కోసం పని చేసిన వామపక్షాలు ఇప్పుడు నాలుగుసీట్ల కోసం వేర్పాటువాదం ఎజెండాతో ముందుకు వచ్చిన టిఆర్ఎస్తో జత కడుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్పై ధ్వజమెత్తిన టిఆర్ఎస్ ఇప్పుడు అదే పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడం అవకాశవాదమేనని ఆయన అన్నారు. నక్సల్స్తో దోస్తీకి ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయని ఆయనవిమర్శించారు. అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీకి తిరిగి పట్టం కట్టాలని ఆయన ప్రజలనుకోరారు.