విజయభేరికి ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: అధికార దాహంతోనే కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పొత్తులు కుదుర్చుకున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాష్ట్ర హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ విమర్శించారు. అధికారం కోసం అవకాశవాద పొత్తులకు దిగాయని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు.
భయంతోనే కాంగ్రెస్, టిఆర్ఎస్ పొత్తుపై తెలుగుదేశం పార్టీవిమర్శలు చేస్తున్నదనే వ్యాఖ్యను విలేకరులు ప్రస్తావించగా ప్రత్యర్థుల గురించి మాట్లాడకపోతే ఎవరి గురించి మాట్లాడతాం? సినిమాల గురించి మాట్లాడాలా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ రెండు పార్టీలు లేవని, తమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయేనని, టిఆర్ఎస్ కాంగ్రెస్లోవిలీనమైపోయిందని, టిఆర్ఎస్ అనే పార్టీ లేదని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్న టిఆర్ఎస్తో పొత్తుపెట్టుకోవడంపై కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.