విజయభేరికి ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)తో పొత్తుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యక్తిగత శ్రద్ధ చూపారని లోక్జనశక్తి నాయకుడు రాం విలాస్ పాశ్వాన్ చెప్పారు. ఆయన శుక్రవారంనాడు సతీసమేతంగా టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ఇచ్చిన విందుకు హాజరయ్యారు.
కాంగ్రెస్, టిఆర్ఎస్ల పొత్తు ఎంత మాత్రం అవకాశవాదం కాదని ఆయన విలేకరులతో అన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని హామీ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం అవకాశవాదం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్డిఎ ప్రభుత్వ పాలనపై ఏ వర్గం కూడా సంతృప్తితో లేదని, వచ్చే ఎన్నికల్లో లౌకిక కూటమి గెలుస్తుందని ఆయన అన్నారు. లౌకిక కూటమికి మెజారిటీ వస్తే ప్రధాని ఎవరవుతారని అడిగితే చాలా మంది అందుకు అర్హులైవారున్నారని ఆయన సమాధానిమిచ్చారు. వ్యవధి కన్నా ముందే వాజ్పేయి ప్రభుత్వం లోక్సభను రద్దు చేయడం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు.