వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) మాజీ నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్ర పర్యటనను ఖరారు చేసేందుకు వారు ఢిల్లీ వెళ్లినట్లు భావిస్తున్నారు. సోనియా గాంధీ ఈ నెల 10,11,12 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. దానికితోడు వామపక్షాలతో ఎన్నికల అవగాహనపై శ్రీనివాస్, వైయస్లు సోనియాతో చర్చించే అవకాశం ఉంది. పార్టీ అభ్యర్థులఎంపికపై కూడా వీరు సోనియాతో మాట్లాడుతారని తెలుస్తోంది.
Story first published: Monday, March 1, 2004, 23:53 [IST]