కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
హైదరాబాద్: టికెట్ల కోసం హైదరాబాద్ చుట్టూ తిరిగితే అనర్హత వేటు పడుతుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పార్టీ నాయకులను హెచ్చరించారు. టికెట్ల కోసం నాయకులు హైదరాబాద్, ఢిల్లీ చుట్టూ,సీనియర్ నేతల చుట్టూ తిరగకూడదని ఆయన సోమవారంవిలేకరుల సమావేశంలో సూచించారు.
పార్టీ టికెట్లవిక్రయం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) కార్యాలయాల్లో సోమవారం ప్రారంభమైంది. జిల్లా స్థాయిలోనే టికెట్లు ఆశిస్తున్నవారు దరఖాస్తులు కొనుగోలు చేసి సమర్పించాలని శ్రీనివాస్ సూచించారు. లోక్సభ, శాసనసభసీట్ల కోసం దరఖాస్తు చేసుకునేవారి కోసం దరఖాస్తులను పిసిసి డిసిసి కార్యాలయాలకు పంపింది. టికెట్లు ఆశిస్తున్నవారు నియోజకవర్గాల్లోనే ఉండి పని చేయాలని శ్రీనివాస్ అన్నారు. సోమవారంసీనియర్ కాంగ్రెస్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ విశాఖ-1అసెంబ్లీ స్థానం కోసం దరఖాస్తు ఫారం కొనుగోలు చేశారు.