వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయం రైతుల ఆగ్రహావేశాలకు ధ్వంసమైంది.మిర్చి ధర విపరీతంగా పడిపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఫర్నీచర్ను తగులబెట్టారు. కొందరు రైతులు తమ బట్టలను కూడా తగులబెట్టుకున్నారు.
వారం క్రితంక్వింటాలుకు 4000 రూపాయలు పలికిన మిర్చి ధర సగానికి సగం పడిపోయింది. ప్రస్తుతంమిర్చి ధర క్వింటాలుకు 1800 రూపాయలు ఉంది. దీంతో చెప్పిన ధరకే తమమిర్చిని విక్రయించాల్సిన స్థితిలో రైతులు పడ్డారు. ఇది మింగుడు పడని రైతులు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ఈవిషయమై తగిన వివరాలు అందించే అధికారులు కూడా కరువయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Story first published: Monday, March 1, 2004, 23:53 [IST]