కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
టిఆర్ఎస్, కాంగ్రెస్ల పొత్తు ప్యాకేజీపై టిఆర్ఎస్ సహా ఎవరూ ఏది చెప్పినా నిజం కాదని ఆయన అన్నారు. ఈ విషయంలో ఎఐఐసియే తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఈ విషయమై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. అయితే ప్యాకేజీ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా వుంటుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మొదటి రాష్ట్రాల పునర్విభజన కమీషన్ (ఎస్ఆర్సి)కి కాంగ్రెస్ అంగీకరించిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో శ్రీనివాస్ ఆ వివరణ ఇచ్చారు. తాము మొదటి ఎస్ఆర్సికి అంగీకరించినట్లు టిఆర్ఎస్ చేసిన ప్రకటనలో నిజం లేదని ఆయన అన్నారు. అభ్యర్థుల జాబితాను తాను అధిష్ఠానానికి సమర్పించలేదని కూడా ఆయన చెప్పారు. టిఆర్ఎస్తో పొత్తు వల్ల పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కొంతమంది సిట్టింగ్ శాసనసభ్యుల త్యాగాలు చేయకతప్పదని శ్రీనివాస్ సమావేశంలో అన్నారు.
కాంగ్రెస్ మొదటి ఎస్ఆర్సికి అంగీకరించిందనే మాట నిజం కాదని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) మాజీ నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్లో విలేకరులతో అన్నారు. రెండో పునర్విభజన కమీషన్ వేయాలని తమ పార్టీ తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.