వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

ఎస్‌ఆర్‌సివిషయంలో కాంగ్రెస్‌తో తమకు ఎటువంటి విభేదాలు లేవని ఆయన అన్నారు. తెలంగాణలోని 107 శాసనసభా నియోజకవర్గాలకు అభ్యర్థలను ఎంపిక చేసిన తర్వాత కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ సంయుక్తంగా శిక్షణా శిబిరం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. తొలి ఎస్‌ఆర్‌సికి కట్టుబడి వుంటామని ఎఐసిసి నేత ప్రణబ్‌ ముఖర్జీ తమకు హామీ ఇచ్చారని, ఈ మేరకు ఎఐసిసి నిర్ణయం తీసుకుందని ఢిల్లీ వెళ్లి వచ్చిన కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌, టిఆర్‌ఎస్‌ నాయకుడు రాజేశ్వరరావు చెప్పారు. పొత్తు ప్యాకేజీపై కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చర్చలు జరిపేందుకు ఆయన ఢిల్లీ వెళ్లి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం ఇక్కడి నాయకులకు తెలియకపోవడం వల్ల విభిన్నమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు.

ఇదిలా వుంటే, తెలంగాణ, విదర్భ రాష్ట్రాల ఏర్పాటు చేస్తామనే హామీని ఎఐసిసి తన ఎన్నికల ప్రణాళికలో చేర్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంమీద టిఆర్‌ఎస్‌ను దూరం చేసుకోవడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇష్టపడడం లేదనేది స్పష్టం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X