నక్సల్స్దర్బార్లు పెట్టవద్దు: వైయస్
హైదరాబాద్: మొదటి రాష్ట్రాల పునర్విభజన కమీషన్ (ఎస్ఆర్సి)కి కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ స్పష్టంగా హామీ ఇచ్చిందని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తొలి ఎస్ఆర్సికి కట్టుబడి ఉంటామనేవిషయాన్ని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో చేర్చబోతున్నదని ఆయన శుక్రవారంవిలేకరుల సమావేశంలో అన్నారు.
తెలంగాణవిషయంలో మొదటి ఎస్ఆర్సిని గౌరవిస్తామని కాంగ్రెస్ చెప్పిందని, కాంగ్రెస్ ప్రకటనలో అదొకటే తెలంగాణకు సంబంధించిందని, ప్రకటనలోమిగతా విషయమంతా ఇతర ప్రాంతాలకు సంబంధించిందని ఆయన అన్నారు. తొలి ఎస్ఆర్సికి అంగీకరించకపోతే కాంగ్రెస్ తన ప్రకటనను ఎందుకు మార్చుకుంటుందని ఆయన అడిగారు. తెలంగాణపై తమ వైఖరి స్పష్టం చేస్తే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జై ఆంధ్రఅంటారా అని ఆయన అడిగారు. సమైక్యవాది అయిన చంద్రబాబుకు ఎస్ఆర్సి సంగతి ఎందుకని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ పొత్తుకు భయపడి కోస్తాంధ్రలోసెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయనవిమర్శించారు.