వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
హైదరాబాద్:సీట్ల సర్దుబాటును కాంగ్రెస్ జాప్యం చేయడం పట్ల సిపిఎం కూడాఅసహనం ప్రదర్శిస్తోంది. తాము 18 అసెంబ్లీ స్థానాలకు, రెండు పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు ఆదివారంవిలేకరులతో అన్నారు.
కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లతో విభేదాలున్నప్పటికీ తెలుగుదేశం- బిజెపి వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతోసీట్ల సర్దుబాటుకు తాము సిద్ధపడినట్లు ఆయన తెలిపారు.సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ వెంటనే ఒక నిర్ణయానికి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్న రాష్ట్రాలపేరుతో దేశాన్ని ముక్కలు చేసిన బిజెపితో తెలుగుదేశం పొత్తుపెట్టుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. రామమందిర నిర్మాణం గురించి మాట్లాడుతున్న బిజెపితో తెలుగుదేశం పొత్తు కుదుర్చుకుని లౌకిక విధానానికి తూట్లు పొడుస్తోందని ఆయనవిమర్శించారు.
Story first published: Sunday, March 7, 2004, 23:53 [IST]