వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
కరాచీ: భారత్, పాక్ జట్ల మధ్య కరాచీలో జరిగే తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ టికెట్లు కొనడానికి వచ్చిన అభిమానులను నియంత్రించడానికి పోలీసులు బలప్రయోగం చేయాల్సి వచ్చింది. మ్యాచ్ జరిగే నేషనల్ స్టేడియం ఆదివారం ఉదయమే నిండిపోయింది. పలువురు మహిళలు, పిల్లలు కూడా రావడంవిశేషం.
ప్రజలు ఎంక్లోజర్లోకి చొచ్చుకు రావడంతో, ప్రాక్టీస్వికెట్ను, ఫెన్సింగ్ను ధ్వంసం చేయడంతో టికెట్ల అమ్మకాలను సోమవారం వరకు నిలిపేశారు. టికెట్ల అమ్మకాలను నిలిపేయడం పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. టికెట్లు చాలా ఉన్నాయని ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ రమీజ్ రాజాఅంటున్నారు. సోమవారంనాడు అమ్మకాలను సజావుగా సాగించడానికి తగిన వ్యూహాన్ని రూపొందిస్తామని ఆయన చెప్పారు.
Story first published: Sunday, March 7, 2004, 23:53 [IST]