వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
హైదరాబాద్: తెలంగాణలో ఆయకట్టుపెరిగిందా, లేదా తేల్చడానికి బహిరంగ చర్చకు రావాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్ రావు భారీ నీటి పారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరికి సవాల్విసిరారు. తెలంగాణలో ఆయకట్టు పెరిగిందని శ్రీహరి చేసిన ప్రకటనను ఆయన ఆదివారంవిలేకరుల సమావేశంలో ఖండించారు.
గత 50 యేళ్లలో తెలంగాణలో ఒక ఎకరం ఆయకట్టు కూడా అదనంగా సాగులోకి రాలేదని ఆయన అన్నారు. చెరువులు, కాలువల కింద మూడు లక్షల ఎకరాల ఆయకట్టు తగ్గిందని ఆయన చెప్పారు. తెలుగుదేశం చేపట్టినసమైక్యతా ప్రదర్శన విఫలమైందని ఆయన అన్నారు. తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వస్తే హక్కుల గురించి మాట్లాడేస్వేచ్ఛ కూడా ఉండదని, ఏది డిమాండ్ చేసిన నక్సలైట్ ముద్ర వేస్తారని ఆయన అన్నారు. ప్రాథమిక హక్కులుండవని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని చంద్రబాబుసర్వనాశనం చేస్తారని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, March 7, 2004, 23:53 [IST]