వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
ఘజియాబాద్: గుజరాత్లో 2002లో జరిగిన ఘర్షణలు ఒక మచ్చ అని ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ అన్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) పాలనలో ఈ ఘర్షణలు దురదృష్టకరమైనవని, ఈ ఘర్షణలుమినహా ఎన్డిఎ పాలనాకాలమంతా సజావుగా సాగిపోయిందని ఆయన అన్నారు.
35వ రైజింగ్ డే సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల అధికార్లను, జవాన్లను ఉద్దేశించి ఆయన సోమవారం ప్రసంగించారు. సత్పరిపాలన నినాదంతో వాజ్పేయి ప్రభుత్వం 1998లో ఏర్పడిందని, ఈ హామీని ప్రభుత్వం నెరవేర్చిందని, ఇటీవలి కాలంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. పాకిస్థాన్తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, ప్రచ్ఛన్న యుద్ధాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం నిజాయితీతో కృషి చేసిందని ఆయన చెప్పారు.
Story first published: Monday, March 8, 2004, 23:53 [IST]