వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని తిరిగి గెలిపించాల్సిన బాధ్యత మహిళలదేనని పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సం సందర్భంగా ఎన్టీఆర్ స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో వివిధ రంగాల్లోని మహిళలను ఆయన సోమవారం సత్కరించారు.
మహిళల అభివృద్ధికి తమ ప్రభుత్వం చేసిన కృషికి రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలే నిదర్శనమని,అందువల్ల తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన బాధ్యత వారిమీదనే ఉన్నదని ఆయన అన్నారు. స్త్రీలకు అన్యాయం చేసే పార్టీలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. చట్టసభల్లోస్త్రీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం తాను పోరాడుతాననిఆయన చెప్పారు. డ్వాక్రా మహిళలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు.
Comments
Story first published: Monday, March 8, 2004, 23:53 [IST]