వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశంటికెట్పై నాగేందర్: డియస్పైనిప్పులు
తెలుగుదేశం ప్రభుత్వం తన ఎనిమిదేళ్ల పాలనలో ఏడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచిందని ఆమె చెప్పారు. లాభాల్లో ఉన్న నిజాం పంచదార కర్మాగారాన్ని తెలుగుదేశం ప్రభుత్వం విక్రయించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలలోనే జరిగిందని ఆమె చెప్పారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాల వైఫల్యాల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, చేనేత కార్మికులు పేదరికంలో మగ్గిపోతున్నారని ఆమె అన్నారు. కేంద్రంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) ప్రభుత్వం కుంభకోణాల్లో ఇరుక్కుందని ఆమె విమర్శించారు.
Comments
Story first published: Wednesday, March 10, 2004, 23:53 [IST]