వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌దర్బార్లు పెట్టవద్దు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పాలక తెలుగుదేశం పథకాలు రెండింటికి ఎన్నికల కమీషన్‌ బ్రేక్‌లు వేసింది. దానికి తోడు తెలుగుదేశం వంద మాసాల పాలనవిజయాలపై పుస్తకం అచ్చుపై పోలీసు దర్యాప్తునకు ఆదేశించింది. గ్రామీణపేద మహిళలకు గ్యాస్‌ సిలిండర్ల పంపణీని, బాలికలకుసైకిళ్ల పంపిణీని నిలిపేయాల్సిందిగా ఎన్నికల కమీషన్‌ అధికారులను ఆదేశించింది.

గ్యాస్‌ సిలిండర్ల పంపిణీని,సైకిళ్ల పంపిణీని ఆపేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశామని, రాతపూర్వకమైన ఆదేశాలను కూడా ఇస్తామని ప్రధాన ఎన్నికల కమీషనర్‌ టి.యస్‌. కృష్ణమూర్తి శుక్రవారంవిలేకరులతో చెప్పారు. కరువు సహాయక చర్యలు వంటి అత్యవసర పనులు, వ్యక్తులకు సంబంధం లేని ప్రాజెక్టు పనులను కొనసాగించవచ్చునని, అయితే ఇవన్నీ రాజకీయ నేతల ఆధ్వర్యంలో కాకుండా అధికారుల కమిటీ నేతృత్వంలో కొనసాగాలని ఆయన అన్నారు.

ఎన్నికల ఏర్పాట్లపై, భద్రతా చర్యలపై ఆయన సమీక్ష చేశారు. గ్యాస్‌ సిలిండర్ల, సైకిళ్ల పంపిణీపై ప్రతిపక్షాలు సిఇసికి ఫిర్యాదు చేశారు. వంద మాసాల విజయాలు అనే పుస్తకం అచ్చుపై దర్యాప్తు చేసి, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని నగర పోలీసు కమీషనర్‌ను ఆదేశించినట్లు కృష్ణమూర్తి తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X