నక్సల్స్దర్బార్లు పెట్టవద్దు: వైయస్
విజయవాడ: రైతుల దుస్థితికి రాష్ట్రంలోని తెలుగుదేశం, దేశంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వాలే కారణమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీవిమర్శించారు. విజయవాడ శంఖారావం బహిరంగ సభలో ఆమె శుక్రవారం బిజెపి ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్లో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందోఅర్థం చేసుకోవచ్చునని ఆమె అన్నారు. చేనేత కార్మికులు, మత్స్యకార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయని ఆమె అన్నారు. దేశాన్ని నిరుద్యోగం పట్టి పీడిస్తోందని ఆమె అన్నారు.సాగు, తాగు నీటి సౌకర్యాల కల్పనలో ప్రభుత్వంవిఫలమైందని, కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి సంవత్సరాలు గడిచినా పూర్తి కాలేదని,మిగతా ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఇదేనని ఆమె అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పడే పోలవరం ప్రాజెక్టును తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును చేపడుతామని ఆమె చెప్పారు. కాకినాడ, మచిలీపట్నం, కళింగ పట్నం, తదితర ఓడరేవులను అభివృద్ధి చేస్తామని ఆమె చెప్పారు.
బిజెపి ప్రభుత్వం స్కామ్ల ప్రభుత్వమని, బిజెపి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా స్కామ్లేనని ఆమె అన్నారు. బిజెపి అధ్యక్షుడే డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డారని ఆమె అన్నారు. ఇందిరాగాంధీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలుఅందించిన మద్దతుకు తాను, తన సంతానం రాహుల్, ప్రియాంక కృతజ్ఞతులై ఉంటారని ఆమె అన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారని ఆమె అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు దాసరి నారాయణరావు బహిరంగ సభలో ప్రసంగించారు.