వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
హైదరాబాద్: ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ భారత్ ఉదయ్ యాత్రలో తమ పార్టీ పాల్గొనే అవకాశాలున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచనప్రాయంగా తెలియజేశారు. వచ్చే వారంలో అద్వానీ యాత్ర ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. అద్వానీ భారత్ ఉదయ్ యాత్రను చంద్రబాబు శనివారంవిలేకరుల సమావేశంలో గట్టిగా సమర్థించారు.
ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వాన్ని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. వాజ్పేయి చొరవ వల్లనే పాకిస్థాన్ వంటి పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు మెరుగయ్యాయని, నేటిపాక్, భారత్ల క్రికెట్ మ్యాచ్ కూడా వాజ్పేయి చొరవ వల్లనే జరుగుతోందని ఆయన అన్నారు.
Comments
Story first published: Saturday, March 13, 2004, 23:53 [IST]