వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ భారత్‌ ఉదయ్‌ యాత్రలో తమ పార్టీ పాల్గొనే అవకాశాలున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచనప్రాయంగా తెలియజేశారు. వచ్చే వారంలో అద్వానీ యాత్ర ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది. అద్వానీ భారత్‌ ఉదయ్‌ యాత్రను చంద్రబాబు శనివారంవిలేకరుల సమావేశంలో గట్టిగా సమర్థించారు.

అద్వానీ యాత్రలో పాలు పంచుకుంటే తప్పేమిటి? అభివృద్ధిఅంశాలపై సాగుతున్న యాత్ర అది అని ఆయన అన్నారు.మీరు యాత్రలో పాల్గొంటారా, లేదా చెప్పాలని విలేకరులు పట్టుబట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఒకటి రెండు చోట్ల పాలు పంచుకుంటే తప్పేమీ కాదని ఆయన అన్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ)కి బయటి నుంచి మద్దతు ఇస్తున్న కీలకమైన పార్టీ తమది అని, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి సాగుతున్న యాత్ర కాబట్టి తాము పాల్గొనడంలో తప్పేమీ ఉండదని ఆయన అన్నారు.

ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి నాయకత్వాన్ని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. వాజ్‌పేయి చొరవ వల్లనే పాకిస్థాన్‌ వంటి పొరుగుదేశాలతో భారత్‌ సంబంధాలు మెరుగయ్యాయని, నేటిపాక్‌, భారత్‌ల క్రికెట్‌ మ్యాచ్‌ కూడా వాజ్‌పేయి చొరవ వల్లనే జరుగుతోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X