వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: రాజకీయాల్లో ధన, భుజ బలాల పాత్ర పెరగడం పట్ల ప్రధాన ఎన్నికల కమీషనర్‌(సిఇసి) టి.యస్‌. కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యంలో, పౌరసత్వంలో గుణాత్మకమైన మార్పు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. చెన్నైలోని లయోలా కాలేజీ 79వ వార్షికోత్సవ సభలో ఆయన శనివారం ప్రసంగించారు.

దేశంలో ప్రజాస్వామ్యం తీరు పట్ల, కొన్ని రాజ్యాంగ సంస్థల పనితీరు పట్ల తనకువిచారం కలుగుతోందని ఆయన అన్నారు. ఉత్తమ రాజకీయ నాయకుల వల్లనే సత్పరిపాలన సాధ్యమవుతుందని,అందుకు రాజకీయ నాయకులకు ఉత్తమ విద్య, సాంస్కృతిక నేపథ్యం అవసరమని ఆయన అన్నారు. ఎన్నికలతో పాటు దేశ ప్రజాస్వామిక ప్రక్రియల్లో యువత చురుకుగా పాలు పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశానికి విద్యావంతులైన, క్రమశిక్షణ గల ప్రతినిధుల, నాయకుల అవసరం ఎంతో ఉందని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X