వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోక్‌సభకు పోటీ చేసే భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థుల తొలి జాబితాలో ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి పేరు చోటు చేసుకుంది. ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌ సింగ్‌పేర్లు కూడా ఉన్నాయి. బిజెపి తన తొలి జాబితాను ఆదివారంనాడు విడుదల చేసింది.

వాజ్‌పేయి లక్నో నుంచి పోటీ చేస్తారు. అద్వానీ గాంధీనగర్‌ నుంచి, కళ్యాణ్‌ సింగ్‌ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బులందేశ్వర్‌ నుంచి పోటీ చేస్తారు. బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ ఆదివారంనాడు సమావేశమై పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేసింది.సీనియర్‌ మంత్రి రామ్‌నాయక్‌ ముంబాయి నుంచి పోటీ చేస్తారు.

న్యాయ వాణిజ్య శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ, వ్యవసాయశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రమోద్‌ మహాజన్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీలను పోటీకి దించకూడదని ఎన్నికల కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌ పార్టీ ఇన్‌చార్జి కల్‌రాజ్‌మిశ్రాను కూడా లోక్‌సభ బరిలోకి దించకూడదని పార్టీ నిర్ణయించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X