కాంగ్రెస్ కుశివశంకర్, కేశవరావు రాజీనామా
న్యూఢిల్లీః మంగళవారం భారత్-పాక్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ సిగ్నల్స్ ను దూరదర్శన్ కు ఇవ్వవలసిందిగా సుప్రీంకోర్టు సోమవారం టెన్ స్పోర్ట్స్ ఛానల్ ను ఆదేశించింది. రావల్పిండి మ్యాచ్ కి మాత్రమే పరిమితమైన ఈ తాత్కాలిక ఉత్తర్వు భారత క్రికెట్ అభిమానులకు ఊరట కలిగించింది. ఈ నెల 17న తుది విచారణ జరగనుంది. ఈలోపు 10 కోట్ల రూపాయలను సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వద్ద డిపాజిట్ చేయవలసిందిగా న్యాయమూర్తులు దూరదర్శన్ ను, ప్రసారభారతిని ఆదేశించారు.
మ్యాచ్ లను టెన్ స్పోర్ట్స్ సిగ్నల్స్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేసేటప్పుడు యాడ్స్ ను, టెన్ స్పోర్ట్స్ లోగోలను కూడా తప్పనిసరిగా ప్రసారం చేయాలని కోర్టు షరతులు పెట్టింది. తొలిరోజు మ్యాచ్ ను టెలికాస్ట్ చేసేటప్పుడు కొన్ని గంటలసేపు టెన్ స్పోర్ట్స్ లోగో చూపించకపోవడం, డిడి తన సొంత యాడ్స్ ప్రసారం చేసుకోవడం పట్ల విదేశీ టీవీ ఛానల్ టెన్ స్పోర్ట్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది.