వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశంటికెట్పై నాగేందర్: డియస్పైనిప్పులు
రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్ ఆటంకం కలిగించే చర్యలకు ఒడిగడుతోందని ఆయన విమర్శించారు. వ్యక్తిగత లాభాల కోసం కొంతమంది నాయకులు రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. విదేశీ సంస్థల నుంచి వస్తున్న గ్రాంట్లను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని, ఆ రకంగా అడ్డం పడడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూసి ఆనందించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. పొట్టి శ్రీరాములు వంటి నాయకుల ఆదర్శాన్ని తీసుకుని సమైక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Story first published: Tuesday, March 16, 2004, 23:53 [IST]