వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంటికెట్‌పై నాగేందర్‌: డియస్‌పైనిప్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ తీరుపై అసంతృప్తి చెందిన సిపిఎం రాష్ట్ర కమిటీ తన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వైఖరికి సిపిఎం తీవ్ర అసంతృప్తికి గురైంది.

సిపిఎం 16 శాసనసభా స్థానాలకు, 2 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మలి జాబితాను త్వరలో విడుదల చేస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రకటించింది. మిర్యాలగూడా, ఖమ్మం లోక్‌సభ స్థానాలకు కూడా సిపిఎం తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ రెండు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్‌సభ స్థానానికి రేణుకా చౌదరిని, మిర్యాలగూడా స్థానానికి ఎస్‌. జైపాల్‌ రెడ్డిని పోటీకి దించుతున్నట్లు కాంగ్రెస్‌ అధిష్ఠాన వర్గం ఇది వరకే ప్రకటించింది. ఈ రెండు స్థానాల కోసం వామపక్షాలు మొదటి నుంచి పట్టుబడుతూ వస్తున్నాయి.

మొదట 12అసెంబ్లీ స్థానాలను, రెండు లోక్‌సభ స్థానాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ క్రమక్రమంగాసీట్ల సంఖ్యను తగ్గిస్తూ వచ్చిందని, ఇప్పుడు 8అసెంబ్లీ స్థానాలు ఇస్తామని అనడం సరైంది కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. ప్రతిపక్షాల మధ్య పోటీ నివారణకు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్‌ ఇలా ఎందుకు వ్యవహరిస్తోందోఅర్థం కావడం లేదని ఆయన అన్నారు. అభ్యర్థుల తొలి జాబితాను ఆయన విడుదల చేశారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశానంతరం రెండో జాబితాను విడుదల చేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X